3 నెలల చిన్నారి హత్య: జైల్లో జంట
- January 11, 2017
మనామా: మూడు నెలల చిన్నారి హత్య కేసులో నిందితులకు జైలు శిక్షను విధించింది హై క్రిమినల్ కోర్ట్. 21 ఏళ్ళ స్టెప్ మదర్కి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా, మృతుడి తండ్రికి ఏడేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత, బిడ్డను తనతోనే ఉంచుకున్నాడు నిందితుడు. ఆ వ్యక్తి నిందితురాలితో కలిసి జీవనం సాగించాడు. ఓ రోజు తలపై గాయాలతో చిన్నారిని ఆసుపత్రికి చేర్చారు వారిద్దరూ. కింద పడి గాయాలపాలయ్యాడని నిందితుడు చెప్పాడు. అయితే నిందితురాలి సమాధానం ఇంకోలా ఉండటంతో ఆసుపత్రి వర్గాలు అనుమానించాయి. అయితే బాబు చనిపోయాడు. దాంతో పోలీసులు కేసు విచారణలో భాగంగా ఇద్దరికీ ఫోరెన్సిక్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో మృతుడి తండ్రి, అలాగే పెంపుడు తల్లి నిందితులని తేలింది. దారుణంగా కొట్టి ఆ చిన్నారిని ఆ ఇద్దరూ చంపినట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







