అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..
- January 11, 2017
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్తారా? లేక వీసా రద్దు చేయమంటారా? అంటూ ఆమె హెచ్చరిక చేశారు.
భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్లను ఈ సంస్థ విక్రయిస్తోంది. వీటిని తక్షణం వాటిని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులందరి వీసాలనూ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మా దేశ పతాకం ఉన్న అన్ని రకాల ప్రొడక్టుల విక్రయాలను నిలిపివేయాలి. ఈ పని చేయకుంటే, అమెజాన్ అధికారులెవ్వరికీ వీసాలు జారీ చేయం.
గతంలో ఇచ్చిన వీసాలనూ రద్దు చేస్తాం" అన్నారు.
కాగా, సుష్మా స్వరాజ్ ట్వీట్ చేసిన నాలుగు గంటల్లోనే అమెజాన్ కేటలాగ్ నుంచి అభ్యంతరకర ప్రొడక్టులను ఆ సంస్థ తొలగించింది. సెర్చ్ రిజల్ట్స్ నుంచి కూడా వాటిని తొలగించింది. ఈ ప్రొడక్టులను తాము డైరెక్టుగా విక్రయించడం లేదని, వాటిని థర్డ్ పార్టీ సెల్లర్స్ తమ వెబ్సైట్ మాధ్యమంగా విక్రయిస్తున్నారని వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్..
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి







