శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్..
- January 11, 2017
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాల్లో సీఐఎస్ఎఫ్, డాగ్స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శంషాబాద్ నుంచి ఎయిర్పోర్టు వైపునకు వచ్చే ప్రధాన రహదారితో పాటు అరైవల్, డిపార్చర్లకు వెళ్లే దారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. పార్కింగ్లో నిలిపిన వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
హజ్ టెర్మినల్, కార్గో టెర్మినల్, వీవీఐపీ గేటు, వీవీఐపీ పార్కింగ్, ఎయిర్సైడ్, రోటరీ చౌరస్తా, నోవాటెల్, స్పోర్ట్ ఎరీనా, ఏరో ఏరియా ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







