తీవ్రవాదులను అణచివేసేందుకు జర్మనీ చర్యలు...
- January 12, 2017
- ఎలక్ట్రానిక్ ట్యాగ్లతో గుర్తింపునకు యత్నాలు
బెర్లిన్ : గతేడాది బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్లో దాడి జరిగిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, పర్యవేక్షణా చట్టాలను ప్రక్షాళన చేయాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. జర్మనీలో ఆశ్రయం కోరేవారిని, ఆశ్రయం పొందలేక తిరిగి వెళ్ళేవారిని, రాజకీయ తీవ్రవాదులను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని న్యాయ శాఖ మంత్రి తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన రాజకీయ అసమ్మతివాదులకు కూడా ఈ ట్యాగ్లు వర్తిస్తాయని తెలిపారు. రాడికల్ భావాలతో వ్యవహరించేవారిని కనుగొని వారు హింసాత్మక తీవ్రవాదం వైపు మళ్ళకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది డిసెంబరు 19న బెర్లిన్ మార్కెట్లో జరిగిన దాడిలో 12మంది మరణించగా, 49మంది గాయపడ్డారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 16 నిఘా సంస్థల స్థానే ఒకే ఒక జాతీయ సంస్థను తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







