ప్రపంచ సుందరి పోటీలకు సిక్కు యువతి..
- January 12, 2017
కౌలాలంపూర్ : మలేషియాలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో భారత సంతతి సిక్కు యువతి పాల్గొంటున్నారని పోటీల నిర్వాహకులు తెలిపారు. కిరణ్మీత ్కౌర్ బల్జీత్సింగ్ జసాల్ (20) గతేడాది మిస్యూనివర్స్ మలే షియా టైటిల్ సొంతం చేసుకున్నా రని చెప్పారు. ఈనెల30న మనీలాలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఆమె పాల్గొంటారని అన్నారు. జసాల్ కుటుంబ సభ్యులు కొన్నేండ్ల కిందట భారత్ నుంచి మలేషియాకు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లి రంజిత్ కౌర్ గతేడాది జరిగిన మిసెస్ మలేషియా టైటిల్ను సొంతం చేసుకున్నారు. జసాల్ సోదరీ రణ్మీత్ భారత్లోనే ఉంటూ రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో మెడిసిన్ చేస్తున్నారు.
చదువుతో పాటు మోడలింగ్ రంగంలోనూ ఆమె రాణిస్తున్నారు. జసాల్ రెండో సోదరి కిరణ్..ఇంటర్నేషన్ మెడికల్ యూనివర్సిటీలో డెంటిస్టు కోర్సు చదువుతున్నారు. జసాల్ చెల్లెలిద్దరూ బ్యూటీ క్వీన్స్ అంటూ సినీనటులు ఐశ్వర్యారారు (1994లో మిస్ వరల్డ్ టైటిల్ గ్రహీత ), సుష్మితా సేన్ ( 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గ్రహీత ) కితాబిచ్చారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







