స్వగ్రామానికి సౌదీ జైలు నుంచి...
- January 13, 2017
పదిహేను రోజుల్లో రానున్న లింబాద్రి
జరిమానా చెల్లించడంతో రద్దయిన ఉరిశిక్ష
ఆర్మూర్అర్బన్: హత్య కేసులో సౌదీ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేగాంకి చెందిన చేపూర్ లింబాద్రికి ఊరట లభించింది. ఆయన క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనచారి తెలిపారు. దేగాం గ్రామంలో శుక్రవారం రాత్రి చేపూర్ లింబాద్రి భార్య లక్ష్మీని కలిసిన నవీనచారి ఈ మేరకు సమాచారం తెలిపారు. చేపూర్ లింబాద్రి ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అయితే, 2007లో హత్య కేసులో చేపూర్ లింబాద్రికి అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించింది.
లింబాద్రి అప్పటి నుంచి సౌదీ జైలులో మగ్గుతున్నాడు. నిజామాబాద్ ఎంపీ కవిత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ద్వారా సౌదీ దేశంతో చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా నెల రోజుల క్రితం సౌదీకి చెందిన దాత ఒకరు రూ.కోటి 80 లక్షలను చేపూర్ లింబాద్రి తరఫున జరిమానా చెల్లించాడు. దీంతో సౌదీ ప్రభుత్వం చేపూర్ లింబ్రాది మరణ శిక్షను రద్దు చేసింది. లింబాద్రి 15 రోజుల్లో స్వదేశానికి వచ్చేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నవీనచారి తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రాజు, నర్సయ్య, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









