స్వగ్రామానికి సౌదీ జైలు నుంచి...
- January 13, 2017
పదిహేను రోజుల్లో రానున్న లింబాద్రి
జరిమానా చెల్లించడంతో రద్దయిన ఉరిశిక్ష
ఆర్మూర్అర్బన్: హత్య కేసులో సౌదీ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేగాంకి చెందిన చేపూర్ లింబాద్రికి ఊరట లభించింది. ఆయన క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనచారి తెలిపారు. దేగాం గ్రామంలో శుక్రవారం రాత్రి చేపూర్ లింబాద్రి భార్య లక్ష్మీని కలిసిన నవీనచారి ఈ మేరకు సమాచారం తెలిపారు. చేపూర్ లింబాద్రి ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అయితే, 2007లో హత్య కేసులో చేపూర్ లింబాద్రికి అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించింది.
లింబాద్రి అప్పటి నుంచి సౌదీ జైలులో మగ్గుతున్నాడు. నిజామాబాద్ ఎంపీ కవిత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ద్వారా సౌదీ దేశంతో చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా నెల రోజుల క్రితం సౌదీకి చెందిన దాత ఒకరు రూ.కోటి 80 లక్షలను చేపూర్ లింబాద్రి తరఫున జరిమానా చెల్లించాడు. దీంతో సౌదీ ప్రభుత్వం చేపూర్ లింబ్రాది మరణ శిక్షను రద్దు చేసింది. లింబాద్రి 15 రోజుల్లో స్వదేశానికి వచ్చేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నవీనచారి తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రాజు, నర్సయ్య, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









