విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన తాగుబోతు ప్రయాణికుని జైలుశిక్ష
- January 14, 2017
దోహా : మద్యం మర్యాద నిలపదని నానుడి. నరాల్లో నిషా...మెదడులోని మత్తు ఆ విమాన ప్రయాణికుడిని కట కటాలకు తీసుకువెళ్ళేవరకు వదలలేదు.. మైకంలో మునిగిపోయిన ఆ ప్రయాణికుడు విమానం నడిపే క్యాబిన్ బోర్డులోనికి ప్రవేశించి సిబ్బందిని ఇబ్బందుల పాల్జేసిన నేరానికి ఇంటికి చేరుకోవాల్సిన ఆ వ్యక్తి ఇక్కట్ల పాలయ్యాడు. దోహా క్రిమినల్ కోర్టు రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు100,000 కతర్ రియాళ్ళు జరిమానా విధించింది. పూటుగా మద్యం సేవించి ఆపై విమానంలో అడుగుపెట్టిన ఆ ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి దోహా చేరుకోవాల్సి ఉంది. సేవించిన మద్యం అల్లరిపాలు చేయడమే కాక అతని ఆగడాలు శృతి మించాయి. ఎయిర్ హోస్టెస్ లను వేధింపులకు గురిచేయడమే కాక విమానం నడిపే సిబ్బంది క్యాబిన్లో సైతం ప్రవేశించి పైలట్ల ముందు వీరంగం చేయడంతో విమానం ఎలా నడపాలో తెలియకుండా వారు తికమకలకు గురి చేశాడు. దీనితో ఆ దోసుబాబు అల్లరిని ఇక భరించలేకపోయారు. ఆ వ్యక్తి భద్రత మరియు ఇతర ప్రయాణికులకు అసౌకర్యంగా మారిన ఆ తాగుబోతు ప్రయాణికుడిని ఎలాగోలా సముదాయించి విమానంను దోహాకు తీసుకువచ్చిన సిబ్బంది ఆ తర్వాత ఆ వ్యక్తిని ఆందోళన భద్రతా శాఖ అప్పగించారు. దోహా నేర న్యాయస్థానం తుదకు అతనిని దోషిగా తేల్చింది. ఆ ప్రయాణికుని ఆగడాలను మరింతగా వివరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









