డిజిటల్ ఇండియా కొరకు ఇంకా 80 లక్షల వైఫై హాట్స్పాట్లు
- January 14, 2017
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే దేశ ప్రజలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. వైఫై హాట్స్పాట్ల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే విషయంలో గ్లోబల్ యావరేజ్కు చేరుకోవాలంటే.. మన దేశంలో ఇంకా 80 లక్షల హాట్స్పాట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అసోచామ్-డెలాయిట్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఉన్న హాట్స్పాట్ల సంఖ్య 31,000 మాత్రమే.
'డిజిటల్ ఇండియా- అన్లాకింగ్ ద ట్రిలియన్ డాలర్ ఆపర్చునిటీ' పేరిట నిర్వహించిన ఈ అధ్యయనంలో.. ప్రతి 150 మందికి ఒక వైఫై హాట్స్పాట్ అనేది గ్లోబల్ యావరేజ్గా ఉండగా, దీనిని చేరుకోవడానికి దేశంలో భారీ సంఖ్యలో హాట్స్పాట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని మెట్రో నగరాలతో పోల్చినప్పడు భారత్లోని మెట్రోనగరాల్లో స్పెక్ట్రం లభ్యత చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









