గంగా సాగర్ మేళాలో అపశ్రుతి

- January 15, 2017 , by Maagulf
గంగా సాగర్ మేళాలో అపశ్రుతి

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న గంగా సాగర్ మేళాలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతున్న గంగాసాగర్ మేళాలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కచుబేరియాప్రాంతంలో భక్తులు పడవ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురుకి గాయాలయ్యాయి.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com