ఆఖరి దశలో 'రాజా మీరు కేక'

- January 15, 2017 , by Maagulf
ఆఖరి దశలో 'రాజా మీరు కేక'

నందమూరి తారకరత్న, రేవంత్, నోయెల్, 'మిర్చి' హేమంత్‌... ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిన 'రాజా మీరు కేక'లో ఈ నలుగురూ కీలక పాత్రలు చేశారు. నలుగురిలో రాజు ఎవరు? అనడిగితే... 'వచ్చే నెల వరకూ ఆగండి. సినిమా చూపిస్తాం' అని టి. కృష్ణకిశోర్‌ చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఆర్‌.కె. స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌. ఎం ఈ చిత్రం నిర్మించారు. యాంకర్‌ లాస్య ఓ హీరోయిన్‌గా నటించారు. ఆడియో ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ''కొత్త కథతో తీసిన చిత్రమిది. క్లైమాక్స్‌లో తారకరత్న నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత అద్భుతంగా నటించారు'' అన్నారు కృష్ణ కిశోర్‌. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com