'సెల్ఫ్ అసెంబ్లీ' సాయంతో అత్యంత దృఢమైన 'అణు బంధం'
- January 15, 2017
అణువుల మధ్య అత్యంత దృఢమైన బంధాన్ని శాస్త్రవేత్తలు ఏర్పాటుచేశారు. దీంతో చాలా గట్టి, ఎలా కావాలంటే అలా ఉపయోగించగలిగే పదార్థాలకు మార్గం సుగమమైంది. బ్రిటన్లోని మాంచెస్టర్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. భిన్న స్థాయిల్లో అణువులు పటిష్ఠ బంధాలను ఏర్పరచుకోగలిగే ఓ విధానాన్ని వారు అభివృద్ధిచేశారు. దీన్ని అనుసరించి 192 అణువులతో దృఢమైన వలయాన్ని ఏర్పరిచారు. 20 నానోమీటర్ల పొడవున్న దీనిలో ఎనిమిది క్రాసింగ్స్ ఉన్నాయి. 'అణువుల మధ్య బంధాలు ఏర్పరచడం మగ్గం నేయడం లాంటిదే. తాజా విధానంలో అణువుల పోగులఅన్నీ బంధంలో పాల్గొనేలా చూశాం. ఇప్పటివరకూ ఉన్నవాటిన్నింటిలోనూ ఇదే అత్యంత దృఢ, సంక్లిష్టమైన అణు బంధం'అని పరిశోధకులు డేవిడ్ లీగ్ వివరించారు. 'సెల్ఫ్ అసెంబ్లీ'గా పిలిచే సాంకేతికత సాయంతో ఈ బంధాన్ని సాకారం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







