'సెల్ఫ్ అసెంబ్లీ' సాయంతో అత్యంత దృఢమైన 'అణు బంధం'
- January 15, 2017
అణువుల మధ్య అత్యంత దృఢమైన బంధాన్ని శాస్త్రవేత్తలు ఏర్పాటుచేశారు. దీంతో చాలా గట్టి, ఎలా కావాలంటే అలా ఉపయోగించగలిగే పదార్థాలకు మార్గం సుగమమైంది. బ్రిటన్లోని మాంచెస్టర్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. భిన్న స్థాయిల్లో అణువులు పటిష్ఠ బంధాలను ఏర్పరచుకోగలిగే ఓ విధానాన్ని వారు అభివృద్ధిచేశారు. దీన్ని అనుసరించి 192 అణువులతో దృఢమైన వలయాన్ని ఏర్పరిచారు. 20 నానోమీటర్ల పొడవున్న దీనిలో ఎనిమిది క్రాసింగ్స్ ఉన్నాయి. 'అణువుల మధ్య బంధాలు ఏర్పరచడం మగ్గం నేయడం లాంటిదే. తాజా విధానంలో అణువుల పోగులఅన్నీ బంధంలో పాల్గొనేలా చూశాం. ఇప్పటివరకూ ఉన్నవాటిన్నింటిలోనూ ఇదే అత్యంత దృఢ, సంక్లిష్టమైన అణు బంధం'అని పరిశోధకులు డేవిడ్ లీగ్ వివరించారు. 'సెల్ఫ్ అసెంబ్లీ'గా పిలిచే సాంకేతికత సాయంతో ఈ బంధాన్ని సాకారం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









