'సెల్ఫ్ అసెంబ్లీ' సాయంతో అత్యంత దృఢమైన 'అణు బంధం'
- January 15, 2017
అణువుల మధ్య అత్యంత దృఢమైన బంధాన్ని శాస్త్రవేత్తలు ఏర్పాటుచేశారు. దీంతో చాలా గట్టి, ఎలా కావాలంటే అలా ఉపయోగించగలిగే పదార్థాలకు మార్గం సుగమమైంది. బ్రిటన్లోని మాంచెస్టర్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. భిన్న స్థాయిల్లో అణువులు పటిష్ఠ బంధాలను ఏర్పరచుకోగలిగే ఓ విధానాన్ని వారు అభివృద్ధిచేశారు. దీన్ని అనుసరించి 192 అణువులతో దృఢమైన వలయాన్ని ఏర్పరిచారు. 20 నానోమీటర్ల పొడవున్న దీనిలో ఎనిమిది క్రాసింగ్స్ ఉన్నాయి. 'అణువుల మధ్య బంధాలు ఏర్పరచడం మగ్గం నేయడం లాంటిదే. తాజా విధానంలో అణువుల పోగులఅన్నీ బంధంలో పాల్గొనేలా చూశాం. ఇప్పటివరకూ ఉన్నవాటిన్నింటిలోనూ ఇదే అత్యంత దృఢ, సంక్లిష్టమైన అణు బంధం'అని పరిశోధకులు డేవిడ్ లీగ్ వివరించారు. 'సెల్ఫ్ అసెంబ్లీ'గా పిలిచే సాంకేతికత సాయంతో ఈ బంధాన్ని సాకారం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









