14 మంది ఉపాధ్యాయులను కిడ్నప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు
- January 15, 2017
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఈ ముష్కర గ్రూపు ఆదివారం ఆఫ్గనిస్థాన్లో మరో ఘాతుకానికి పాల్పడింది. తమ దేశంలోని నంగర్హర్ ప్రావిన్స్లోని 14మంది ఉపాధ్యాయులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఆఫ్గన్ విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. కోట్ జిల్లాలోని మెషెర్ ముల్లా సాహిబ్ మదర్సాలో పరీక్షలు జరుగుతుండగా లోపలికి ప్రవేశించిన ముష్కరులు 14మందిని తమతో పాటు తీసుకెళ్లారని వివరించింది. కిడ్నాప్నకు గురైన ఉపాధ్యాయులను వారి చెర నుంచి విడిపించేందుకు భద్రతా దళాలను రంగంలోకి దించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







