14 మంది ఉపాధ్యాయులను కిడ్నప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు
- January 15, 2017
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఈ ముష్కర గ్రూపు ఆదివారం ఆఫ్గనిస్థాన్లో మరో ఘాతుకానికి పాల్పడింది. తమ దేశంలోని నంగర్హర్ ప్రావిన్స్లోని 14మంది ఉపాధ్యాయులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఆఫ్గన్ విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. కోట్ జిల్లాలోని మెషెర్ ముల్లా సాహిబ్ మదర్సాలో పరీక్షలు జరుగుతుండగా లోపలికి ప్రవేశించిన ముష్కరులు 14మందిని తమతో పాటు తీసుకెళ్లారని వివరించింది. కిడ్నాప్నకు గురైన ఉపాధ్యాయులను వారి చెర నుంచి విడిపించేందుకు భద్రతా దళాలను రంగంలోకి దించింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









