14 మంది ఉపాధ్యాయులను కిడ్నప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు

- January 15, 2017 , by Maagulf
14 మంది ఉపాధ్యాయులను కిడ్నప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఈ ముష్కర గ్రూపు ఆదివారం ఆఫ్గనిస్థాన్‌లో మరో ఘాతుకానికి పాల్పడింది. తమ దేశంలోని నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లోని 14మంది ఉపాధ్యాయులను ఐఎస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారని ఆఫ్గన్‌ విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. కోట్‌ జిల్లాలోని మెషెర్‌ ముల్లా సాహిబ్‌ మదర్సాలో పరీక్షలు జరుగుతుండగా లోపలికి ప్రవేశించిన ముష్కరులు 14మందిని తమతో పాటు తీసుకెళ్లారని వివరించింది. కిడ్నాప్‌నకు గురైన ఉపాధ్యాయులను వారి చెర నుంచి విడిపించేందుకు భద్రతా దళాలను రంగంలోకి దించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com