సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్రెడ్డి మృతి
- January 17, 2017
సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీనివాస్రెడ్డి ఉయ్యూరు(56) మంగళవారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. సీనియర్ డైరెక్టర్ సాగర్కు శ్రీనివాస్రెడ్డిగారు సోదరుడవుతారు. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్రెడ్డి ఉయ్యూరు సినిమాటోగ్రాఫర్గానే కాకుండా మౌళి, సుధాకర్బాబు, సాగర్లతో కలిసి మౌళి క్రియేషన్స్ బ్యానర్పై సూపర్స్టార్ కృష్ణతో జగదేకవీరుడు, అమ్మదొంగా వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాత చంటి అడ్డాలతో కలిసి శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్పై బాలకృష్ణతో పవిత్రప్రేమ, కృష్ణబాబు, వినీత్, సౌందర్యలతో ఆరోప్రాణం, పూరిజగన్నాథ్, జగపతిబాబుతో బాచి, శ్రీకాంత్ హీరోగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మొండోడు సినిమాలను నిర్మించాచారు.
రీసెంట్గా రష్మీ గౌతమ్ ప్రధానపాత్రలో రూపొందిన `చారుశీల` సినిమాకు దర్శకత్వం వహించారు. టెక్నిషియన్గా, దర్శక నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్రెడ్డి ఉయ్యూరు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. రేపు హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







