సీరియస్ గా ఉన్న కేటీఆర్..

- January 18, 2017 , by Maagulf
సీరియస్ గా ఉన్న కేటీఆర్..

తెలంగాణా అసంబ్లీ జరిగిన ప్రతీ సారీ సినిమా హీరో నాగార్జున గురించి ప్రస్తావన రావడం మామూలు అయిపొయింది. మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చెయ్యడం కోసం విపక్షాలు నాగార్జున ప్రస్తావన తీసుకోస్తూనే ఉంటారు. ఎన్ని సార్లు ఈ విషయం మీద కేటీఆర్ వివరణ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ విపక్షాలు ఇదే మ్యాటర్ ఎత్తి ఆయన్ని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అక్రమ నిర్మాణాల గురించి, నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించీ కెసిఆర్ - కేటీఆర్ లు అప్పట్లో సీరియస్ గా ఇచ్చిన వార్నింగ్ లు ఏమయ్యాయి అనేది టీటీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి ప్రస్తావించే అంశం. నాగార్జున కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కెసిఆర్ సర్కారు కొమ్ము కాయడం ఏంటి అనీ ఇది ఒక ప్రభుత్వం చెయ్యాల్సిన పనేనా అంటూ రేవంత్ వివరణ కోరారు.
గతంలోనూ ఎన్ కన్వెన్షన్ కట్టటం పైన పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయన్నారు. నాగార్జున సర్కిల్ లోట్రాఫిక్ జాం అవుతోందని.. అక్కడ మల్టీఫ్లెక్స్ కు అనుమతులు ఇవ్వొద్దన్నారు. మరొక పక్క ఎమ్మార్ ప్రాపర్టీస్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉండగా వాటి మీద కూడా ప్రభుత్వం సైలెంట్ గా ఉండడం ఆయన కన్సిడర్ చేస్తున్నారు.
రేవంత్ వేసిన ప్రశ్నలకి ఎప్పటి లాగానే సమాధానాలు చెప్పిన కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి గానీ నాగార్జున కి గానీ గిఫ్ట్ లు ఇచ్చే సంస్కృతి తమది కాదు అని స్పష్టం చేసారు. అంతా చట్టప్రకారం జరుగుతోంది అని దానికే తాము బైండ్ అయ్యి ఉన్నాం అన్నారు ఆయన. నాగార్జున సర్కిల్లో మల్టీఫ్లెక్స్ కట్టే విషయం తమ దృష్టికి రాలేదన్న ఆయన.. ఒకవేళ తమ దృష్టికి వస్తే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com