ఆర్మీ యూనిఫాంలో తిరుగుతున్న ఉగ్రవాదులు
- January 18, 2017
దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో కనిపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో దిల్లీలోని విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు కెప్టెన్, సుబేదార్ ర్యాంకుల్లోని యూనిఫాంలలో ఉన్నట్లు భావిస్తున్నారు. పంజాబ్లోని చక్రి, గురుదాస్పూర్ సరిహద్దు పోస్ట్ల వద్ద అనుమానిత ఉగ్రవాదులు కనిపించినట్లు అమృత్సర్కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. వీరు సరిహద్దు నుంచి భారత్లోకి చొరబడిన తర్వాత ఆర్మీ దుస్తులు ధరించి ఉంటారని అనుమానిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో, మెట్రో స్టేషన్లలో మరింతగా భద్రతను పెంచినట్లు సీఐఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. భద్రత పెంపుతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు కాస్త ఇబ్బందిపడ్డారు. ఒకటికి రెండు సార్లు స్క్రీనింగ్లు, ప్రవేశ ద్వారం వద్ద, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద బ్యాగులు చెక్ చేయడంతో క్యూ లైన్లు పెరిగిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







