మాలిదేశంలో ఆత్మాహుతి దాడి, 40 మంది మృతి
- January 18, 2017
మాలి: ఆఫ్రికాఖండంలోని మాలిదేశంలో జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కారులో వచ్చి తనను పేల్చుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న గావో ఎయిర్పోర్టు సమీపంలోని మాజీ తిరుగుబాటుదారులు, సైనికుల స్థావరాలపై దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది అక్కడికక్కడే మృతిచెందగా 60 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మాలీ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







