భూకంపం ఇటలీలో...
- January 18, 2017
- రిక్టర్స్కేల్పై తీవ్రత 5.3గా నమోదు
రోమ్ : మధ్య ఇటలీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్స్కేల్పై 5.3గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. అమాట్రీస్ నగరానికి 7కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. భూకంప ప్రభావంతో అబ్రూజో, మార్చే, లాజియో, రోమ్ నగరాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు అన్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఆగస్టులో అమాట్రీస్ నగరంలో భారీ భూకంపం సంభవించింది.
భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 6.1గా నమోదైంది. ఈ దుర్ఘటలో 297 మంది మృతి చెందారు.
జపాన్లోనూ...
సెంట్రల్ జపాన్లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్స్కేల్పై 4.2గా నమోదైందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇబారకీ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







