ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ.!
- January 19, 2017
ఇటీవలె వెండితెర మీద సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు బుల్లితెర మీదా తన స్టామినా చూపడానికి సిద్ధమవుతున్నాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగామ్ను ఇకపై నాగార్జున స్థానంలో చిరంజీవి హోస్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్స్ పూర్తయిపోయింది. డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ షో ప్రసారం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ షో హోస్టింగ్లో ఏవైనా తేడాలొస్తే.. ఆ రిజల్ట్ 'ఖైదీ నెంబర్ 150' మీద పడే అవకాశముందని భయపడి ఆపేశారు. ఇప్పుడు చిరంజీవి కమ్బ్యాక్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ షోను ఫిబ్రవరి నుంచి ప్రసారం చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోమోల సంగతెలా ఉన్నా ప్రోగ్రామ్ మాత్రం బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు నిర్వాహకులు. మరి, ఆ నిర్వాహకుల ఆశలను చిరంజీవి ఎంతవరకు నెరవేర్చగలడో చూడాలి.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







