మొదలైన మంచు విష్ణు ద్విభాషా చిత్రం.!
- January 19, 2017
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. రామా రీల్స్ సంస్థ నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న చిత్రంలో విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన సురభి నటిస్తున్నారు. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా జరిపారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు మోహన్బాబు క్లాప్ కొట్టగా.. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ 'మోహన్బాబు, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు మా సినిమా ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పతాకంపై నిర్మించనున్న 5వ సినిమా ఇది. ఎస్.ఎస్. తమన్ స్వరసారధ్యం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది' అని తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







