మొదలైన మంచు విష్ణు ద్విభాషా చిత్రం.!
- January 19, 2017
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. రామా రీల్స్ సంస్థ నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న చిత్రంలో విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన సురభి నటిస్తున్నారు. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా జరిపారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు మోహన్బాబు క్లాప్ కొట్టగా.. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ 'మోహన్బాబు, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు మా సినిమా ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పతాకంపై నిర్మించనున్న 5వ సినిమా ఇది. ఎస్.ఎస్. తమన్ స్వరసారధ్యం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది' అని తెలిపారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









