ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ.!
- January 19, 2017
ఇటీవలె వెండితెర మీద సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు బుల్లితెర మీదా తన స్టామినా చూపడానికి సిద్ధమవుతున్నాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగామ్ను ఇకపై నాగార్జున స్థానంలో చిరంజీవి హోస్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్స్ పూర్తయిపోయింది. డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ షో ప్రసారం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ షో హోస్టింగ్లో ఏవైనా తేడాలొస్తే.. ఆ రిజల్ట్ 'ఖైదీ నెంబర్ 150' మీద పడే అవకాశముందని భయపడి ఆపేశారు. ఇప్పుడు చిరంజీవి కమ్బ్యాక్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ షోను ఫిబ్రవరి నుంచి ప్రసారం చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోమోల సంగతెలా ఉన్నా ప్రోగ్రామ్ మాత్రం బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు నిర్వాహకులు. మరి, ఆ నిర్వాహకుల ఆశలను చిరంజీవి ఎంతవరకు నెరవేర్చగలడో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







