ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ.!
- January 19, 2017
ఇటీవలె వెండితెర మీద సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు బుల్లితెర మీదా తన స్టామినా చూపడానికి సిద్ధమవుతున్నాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగామ్ను ఇకపై నాగార్జున స్థానంలో చిరంజీవి హోస్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్స్ పూర్తయిపోయింది. డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ షో ప్రసారం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ షో హోస్టింగ్లో ఏవైనా తేడాలొస్తే.. ఆ రిజల్ట్ 'ఖైదీ నెంబర్ 150' మీద పడే అవకాశముందని భయపడి ఆపేశారు. ఇప్పుడు చిరంజీవి కమ్బ్యాక్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ షోను ఫిబ్రవరి నుంచి ప్రసారం చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోమోల సంగతెలా ఉన్నా ప్రోగ్రామ్ మాత్రం బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు నిర్వాహకులు. మరి, ఆ నిర్వాహకుల ఆశలను చిరంజీవి ఎంతవరకు నెరవేర్చగలడో చూడాలి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









