పోసాని 'నేను కిడ్నాప్‌ అయ్యాను'

- January 19, 2017 , by Maagulf
పోసాని 'నేను కిడ్నాప్‌ అయ్యాను'

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం 'నేను కిడ్నాప్‌ అయ్యాను'. ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టి.ప్రసన్న కుమార్‌ సినిమాకు క్లాప్‌నిచ్చారు. దగ్గుబాటి వరుణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందులో నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాను. నేనో పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఐదుగురు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నన్ను కిడ్నాప్‌ చేస్తారు. ఎందుకు ఏమిటి ఎలా అనే అంశాలపై సినిమా నడుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు. దర్శకుడు శ్రీకర్‌బాబు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మాధవి అద్దంకి నిర్మాతగావ్యవహరిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం, కార్టూనిస్ట్‌ మల్లిక్‌, రఘుబాబు, పృథ్వీ, కృష్ణభగవాన్‌ తదితరులు నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com