పోసాని 'నేను కిడ్నాప్ అయ్యాను'
- January 19, 2017
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. టి.ప్రసన్న కుమార్ సినిమాకు క్లాప్నిచ్చారు. దగ్గుబాటి వరుణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందులో నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాను. నేనో పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఐదుగురు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నన్ను కిడ్నాప్ చేస్తారు. ఎందుకు ఏమిటి ఎలా అనే అంశాలపై సినిమా నడుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు. దర్శకుడు శ్రీకర్బాబు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మాధవి అద్దంకి నిర్మాతగావ్యవహరిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం, కార్టూనిస్ట్ మల్లిక్, రఘుబాబు, పృథ్వీ, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









