పోసాని 'నేను కిడ్నాప్ అయ్యాను'
- January 19, 2017
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. టి.ప్రసన్న కుమార్ సినిమాకు క్లాప్నిచ్చారు. దగ్గుబాటి వరుణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందులో నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాను. నేనో పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఐదుగురు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నన్ను కిడ్నాప్ చేస్తారు. ఎందుకు ఏమిటి ఎలా అనే అంశాలపై సినిమా నడుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు. దర్శకుడు శ్రీకర్బాబు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మాధవి అద్దంకి నిర్మాతగావ్యవహరిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం, కార్టూనిస్ట్ మల్లిక్, రఘుబాబు, పృథ్వీ, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









