మరోసారి అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్ బ్రాండ్గా ఫ్లిప్కార్ట్
- January 20, 2017
ఎలక్ట్రానిక్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి భారత్లో అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్ బ్రాండ్గా అగ్రస్థానం సంపాదించింది. 'ది ఇండియన్ ఇ-టెయిలింగ్ లీడర్షిప్ ఇండెక్స్' పేరుతో దేశవ్యాప్తంగా వినియోగదారులపై పరిశోధనా సంస్థ రెడ్ సీర్ కన్సల్టింగ్ ఒక సర్వే నిర్వహించింది. ఉత్పత్తుల ఎంపిక, వినియోగదారుల మద్దతు, రిఫండ్, తిరిగి డెలివరీలను స్వాధీనం చేసుకొనే వేగంతో పాటు పలు అంశాల్లో మిగతా ఇ-కామర్స్ సంస్థలను వెనక్కి నెట్టి ఫ్లిప్కార్ట్కే ఎక్కువ స్కోరు వచ్చిందని నివేదికలో వెల్లడించింది. దీంతో వరుసగా నాలుగోసారి విశ్వసనీయ బ్రాండ్గా ఫ్లిప్కార్ట్ తన స్థానాన్ని మరోసారి నిలుపుకొంది. భారత్లోని 30 నగరాల్లో 7500 మంది వినియోగదారులపై సర్వే నిర్వహించి నివేదికను తయారు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







