అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
- January 20, 2017
అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్వేతసౌధంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ప్రమాణం చేసిన అనంతరం దేశాధ్యక్షుడి హోదాలో ట్రంప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నేటి నుంచి దేశంలో ప్రజా పాలన తిరిగి వచ్చిందని.. వాషింగ్టన్ నుంచి ప్రజలకు అధికారాన్ని బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా గమ్యాన్ని మనమంతా కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం ఉందన్నారు. మనదంతా 'ఒకే దేశం- ఒకే హృదయం' అని పేర్కొన్నారు. దేశమే అందరికీ తొలి ప్రాధాన్యం కావాలని.. అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉండాలని ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రతీ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అమెరికన్ల చేతుల మీదుగానే అమెరికా పునర్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైనవారు.. ఇక ఎంతోకాలం నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. వర్ణమేదైనా అందరిలో దేశభక్తి నిండి ఉందని ఉద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుదామన్నారు. మానవాళికి పెనుభూతంగా అవతరించిన ఉగ్రవాదాన్ని భూమిపై నుంచి పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.





తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







