తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తాం: మోదీ...

- January 21, 2017 , by Maagulf
తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తాం: మోదీ...

దిల్లీ: తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జల్లికట్టు నిర్వహణకు మద్దతుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. తమిళనాడు సంప్రదాయాలను గౌరవిస్తామని తెలిపారు. తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమిళుల మనోభావాలకు అద్దంపట్టే జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ చెన్నై మెరీనా బీచ్‌లో గత ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com