ప్రధాని సంతాపం...
- January 22, 2017
న్యూదిల్లీ: విజయనగరం జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హీరాఖండ్ ఎక్స్ప్రెస్ శనివారం రాత్రి పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 32మందికి పైగా మృతిచెందారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంతాపం ప్రకటించారు. ‘ఈ ఘటన చాలా విచారకరం.. బాధాకరం.. విలువైన ప్రాణాలను కోల్పోయాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









