ప్రధాని సంతాపం...
- January 22, 2017
న్యూదిల్లీ: విజయనగరం జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హీరాఖండ్ ఎక్స్ప్రెస్ శనివారం రాత్రి పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 32మందికి పైగా మృతిచెందారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంతాపం ప్రకటించారు. ‘ఈ ఘటన చాలా విచారకరం.. బాధాకరం.. విలువైన ప్రాణాలను కోల్పోయాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







