అక్రమ మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయాలపై ఉక్కుపాదం..
- January 22, 2017
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (డిఇడి), 25 షాపులపై ఒకే రోజు దాడులు నిర్వహించి, జరీమానాలు విధించింది. అక్రమంగా మనీ ట్రాన్సఫర్స్ని ఈ షాప్లు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో తేలింది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న డిఇడి, పలు టీమ్స్ని సోదాల కోసం నియమించింది. అనుమానం రాకుండా ఈ షాప్లు బెంగాలీ భాషలో ప్రచారం చేసుకుంటున్నాయని కమర్షియల్ కంపెనీస్ మరియు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెక్టార్ - డిఇడి సిఇఓ మొహమ్మద్ అలి రషెద్ లూతా చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సిమ్ కార్డ్స్ ద్వారా అక్రమ మనీ ట్రాన్స్ఫర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల నుంచి మాత్రమే ప్రజలు లావాదేవీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







