భారత రాయబారితో కేటీఆర్ భేటీ జపాన్లో...
- January 22, 2017జపాన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్తో ఆదివారం మర్యా దపూర్వకంగా సమావేశమయ్యారు. జపాన్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను ఆయనకు కేటీఆర్ వివరించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు.
సుజయ్ చినాయ్ మాట్లాడుతూ, జపాన్లోని ఒకటిరెండు నగరాలతో సిస్టర్సిటీ ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. చిన్నతరహా పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి సారించాలన్నారు.
జపాన్ కంపెనీలకు కావాల్సిన సిబ్బంది సరఫరా, శిక్షణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. భారత రాయబారి సూచనలకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!