కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్తో పాదచారులకు ఊరట..
- January 22, 2017
రోడ్లపై పాదచారులను ప్రమాదాల నుంచి గట్టెక్కించడానికిగాను 'సఫర్ రూట్స్'ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కొత్త తరహా పాదచారుల లైట్స్ని అల్ సాదా స్ట్రీట్లో పరీక్షించింది. క్రాసింగ్స్ వద్ద పాదచారుల వెయిటింగ్ని తగ్గించేలా ఈ లైటింగ్ సిస్టమ్ని రూపిందించారు. పాదచారులకు తగిన విధంగా ఆటోమేటిక్గా ఈ లైట్లు పనిచేస్తాయి. ఆర్టిఏ ట్రాఫిక్ మరియు రోడ్స్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెథా బిన్ అదాయ్ మాట్లాడుతూ, కొత్త సిగ్నల్స్ పాదచారులకు ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. అలాగే రహదార్లపై ట్రాఫిక్ జామ్స్ కూడా వీటివల్ల కలగబోవని వివరించారాయన. నడకను ప్రోత్సహించే క్రమంలో వీటిని రూపొందించినట్లు తెలిపారు. సెన్సార్ బేస్డ్ స్మార్ట్ యూనిట్ ఆధారంగా ఈ సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. దుబాయ్ వ్యాప్తంగా ఈ సరికొత్త సిగ్నలింగ్ సిస్టమ్ని అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









