ఇటలీలో ప్రమాదానికి గురైన స్కూలు బస్సు:16 మంది విద్యార్ధులు మృతి..

- January 23, 2017 , by Maagulf
ఇటలీలో ప్రమాదానికి గురైన స్కూలు బస్సు:16 మంది విద్యార్ధులు మృతి..

ఇటలీలో టీనేజర్లను తీసుకెళుతున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో 16 మంది సజీద దహనమయ్యారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెరోనా సమీపంలో చోటుచేసుకుంది.  ఫ్రాన్స్‌లోని ఓ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు టూర్‌కు వెళ్ళి తిరిగి వస్తున్న బస్సు పైలాన్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  అందరూ గాఢనిద్రలో ఉండడం, డోర్లు తెరుచుకోకపోవడంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించి భారీగా ప్రాణనష్టం జరిగింది.  హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.  బస్సు డ్రైవరుతోపాటు అతని కుటుంబసభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలినట్లు ఇటలీకి చెందిన పత్రికా ఏజెన్సీ వెల్లడించింది.  ప్రయాణీకుల్లో ఎక్కువమంది హంగేరియాకు చెందిన వారు ఉండగా.. వీరిలో 16 నుంచి 18 ఏండ్లలోపు వారు అధికంగా ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com