కువైట్ నుంచి పక్షుల దిగుమతిపై బహ్రెయిన్ నిషేదం..
- January 24, 2017
బర్డ్ ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ నుంచి వచ్చే వివిధ రకాలైన పక్షులను దిగుమతి చేసుకోవడంపై బ్యాన్ విధించింది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ - అగ్రికల్చరల్ ఎఫైర్స్ మరియు మెరైన్ రీసోర్సెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అన్ని ఎంట్రీ పాయింట్స్ వద్దా స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీని విధించారు. దేశంలోని అన్ని ఫామ్స్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్లలో తనిఖీలు నిర్వహించడానికి ఆదేశాలు చేశామని అగ్రికల్చర్ మరియు మెరైన్ రిసోర్సెస్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ ఇసా అల్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్ బర్డ్ ఫ్లూ నుంచి పూర్తి క్షేమంగా ఉందని, పక్షుల పెంపకందార్లకు ఏమైనా అనుమనాలు కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కువైట్లో బర్డ్ ఫ్లూ కారణంగా 285 పక్షులు మృతి చెందినట్లు ఓఐఇ - వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









