పనస గింజల మామిడి కూర...
- January 24, 2017
కావలసిన పదార్థాలు: పనసగింజలు- 15, మునక్కాడ ముక్కలు- 10, పచ్చి మామిడి తురుము- 1/2 కప్పు, పచ్చిమిర్చి- 4, పసుపు- 1/4 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, జీలకర్ర- 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు- 4, తాలింపు దినుసులు- 1 టీ స్పూను, నూనె- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా కొబ్బరి ముక్కలు, రెండు పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రలను మిక్సీ పట్టి పక్కన ఉంచాలి. తరువాత పసనగింజలపై ఉండే తెల్లని పొట్టు తీసేసి, గింజలను కుక్కర్లో వేసి అర కప్పు నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి తీయాలి. తరువాత ఆ గింజలతో పాటు, మామిడి తురుము, రెండు పచ్చిమిరపకాయలు, మునక్కాడ ముక్కలు, పసుపు వేసి, కప్పుడు నీళ్ళు పోసి, సన్నని మంటపై ఉడికించాలి. మునక్కాడ ముక్కలు ఉడికాక కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. కూర పూర్తిగా ఉడికాక పోపు పెట్టుకోవాలి.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









