కువైట్ యువరాజు షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ సబా మరొక యువరాజు హత్య కేసులో నిందితుడు ...
- January 25, 2017
కువైట్ : కువైట్లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తి సహా ఏడుగురికి బుధవారం ఉరిశిక్ష అమలు చేశారు. 40 మందికి పైగా ప్రజలను హతమార్చిన కేసుల్లో నిందితులైన వీరందరికి అంతర్గత వ్యవహారాల శాఖ ఈ మరణ శిక్షలు అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. స్పెషల్ ఫోర్సెస్, ఆరోగ్య మంత్రిత్వశాఖ సమన్వయంతో ఈ ఉరిశిక్షలలో రాజకుటుంబానికి చెందిన ఫైసల్ అబ్దుల్లా అల్ జబర్ అల్ సబా సైతం ఉన్నారు. అక్టోబర్ 2011 లో తన మేనల్లుడు షేక్ బాసెల్ ను హత్య చేసిన కేసులో ఆయన నిందితుడు కావడంతో క్రిమినల్ కోర్ట్ కువైట్ యువరాజు షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ సబాను దోషిగా తేల్చింది. ఆ తర్వాత ఆయనకు మరణశిక్ష విధించింది.నేరస్థుడు షేక్ ఫైసల్ అబ్దుల్లా ఆల్ జాబెర్, యువరాజు యొక్క మేనమామ, బాధితుడు 20 సంవత్సరాల కన్నా చిన్నవారు. ఆయన కెప్టెన్ హోదాలో సైనిక నిఘా శాఖలో పని చేశారు. చట్టాలను అమలు చేసే విషయంలో తాము కూడా సౌదీకి ఏమాత్రం తీసిపోమని తెలియజేసేలా కువైట్ ప్రభుత్వం ఒకేసారి ఏడుగురికి మరణశిక్షను విధించింది. . గతేడాది సౌదీలో యువరాజుకు మరణశిక్షను విధించినట్లే.. కువైట్లో కూడా రాజవంశీకుడిని బుధవారం ఉరి తీశారు. పలు కేసుల్లో ఉరిశిక్ష పడిన కువైట్, ఇథియోపియన్, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలతో పాటు.. ఈజిప్టుకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఓ బంగ్లాదేశీయుడు, మరో కువైటీని కూడా ఉరితీయనున్నారు. ఈ ఆరుగురితోపాటు రాజకుటుంబానికి చెందిన షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ షబాహ్ను కూడా ఉరి తీసేరు . కువైట్ ఆర్మీలో కెప్టెన్గా పనిచేసిన షబాహ్..2010వ సంవత్సరం జూన్లో కువైట్ మాజీ ఎమిర్కు చెందిన మసీలాహ్ పాలస్కు వెళ్లాడు. అక్కడ తనకు మేనల్లుడు వరసైన షైక్ బసిల్ను కలిశాడు. అందరినీ బయటకు పొమ్మని చెప్పి.. అతడితో గొవడపడి కాల్పులు జరిపి చంపేశాడు. దీంతో షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ సబాకు 2011 అక్టోబర్ నెలలో కువైట్ కోర్టు మరణ శిక్షను ఖాయం చేసింది. ఈ ఏడుగురిని బుధవారం కువైట్ కేంద్ర కారాగారంలో ఉరితీయనున్నారు. వీరికి సంబంధించిన బంధువులను.. ఈ ఒక్కరోజు కొన్ని గంటల పాటు కలిసేందుకు వీలిచ్చారు. కొత్త యేడాదిలో మొట్టమొదటి సారి మరణశిక్షను అమలు చేయబోతుండటంతో.. కువైట్లో గంభీర వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







