ప్రముఖుల నివాళులు రాజ్‌ఘాట్‌లో బాపూకు ...

- January 30, 2017 , by Maagulf
ప్రముఖుల నివాళులు రాజ్‌ఘాట్‌లో బాపూకు ...

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సోమవారం ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని బాపూ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్ముడికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రలు, ముఖ్య నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు మహాత్మాగాంధీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com