వంకాయ, రొయ్యలు చింత చిగురుతో...
- January 30, 2017
కావలసిన పదార్థాలు: వంకాయలు - 250గ్రా, ఎండు రొయ్యలు - 100గ్రా, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: చెంచాడు నూనెలో ఎండు రొయ్యలు దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు, చింతచిగురు, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. కాసేపయ్యాక మసాలా పొడి, వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి నీళ్ళు పోసి ఇంకొంచెంసేపు ఉడికించి దింపుకోవాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









