వంకాయ, రొయ్యలు చింత చిగురుతో...
- January 30, 2017కావలసిన పదార్థాలు: వంకాయలు - 250గ్రా, ఎండు రొయ్యలు - 100గ్రా, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: చెంచాడు నూనెలో ఎండు రొయ్యలు దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు, చింతచిగురు, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. కాసేపయ్యాక మసాలా పొడి, వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి నీళ్ళు పోసి ఇంకొంచెంసేపు ఉడికించి దింపుకోవాలి.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ