వంకాయ, రొయ్యలు చింత చిగురుతో...
- January 30, 2017
కావలసిన పదార్థాలు: వంకాయలు - 250గ్రా, ఎండు రొయ్యలు - 100గ్రా, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: చెంచాడు నూనెలో ఎండు రొయ్యలు దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు, చింతచిగురు, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. కాసేపయ్యాక మసాలా పొడి, వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి నీళ్ళు పోసి ఇంకొంచెంసేపు ఉడికించి దింపుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









