వంకాయ, రొయ్యలు చింత చిగురుతో...
- January 30, 2017కావలసిన పదార్థాలు: వంకాయలు - 250గ్రా, ఎండు రొయ్యలు - 100గ్రా, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: చెంచాడు నూనెలో ఎండు రొయ్యలు దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు, చింతచిగురు, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. కాసేపయ్యాక మసాలా పొడి, వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి నీళ్ళు పోసి ఇంకొంచెంసేపు ఉడికించి దింపుకోవాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం