భారతీయుడి అరెస్ట్పై సుష్మ ఆరా..
- January 31, 2017
అమెరికాలోని నార్త్ డకోటా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కేసులో భారతీయ వ్యక్తిని అరెస్ట్ చేయడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆరా తీస్తున్నారు. అమెరికాలో భారత రాయబారిని ఈ ఘటనపై నివేదిక కోరినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. గుజరాత్కు చెందిన పరమన్ రాధాకృష్ణన్(53) అనే వ్యాపారిని శనివారం నార్త్ డకోటాలోని గ్రాండ్ ఫోర్క్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు.
తన బ్యాగులో పేలుడు పదార్థాలున్నాయని ట్రావెల్ ఏజెంట్తో చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు రాధాకృష్ణన్ను అరెస్ట్ చేశారు.
తన భర్తకు సహాయం చేయాలని కోరుతూ రాధాకృష్ణన్ భార్య ట్విట్టర్ ద్వారా సుష్మను అభ్యర్థించారు. ఆమెకు ట్వీట్కు స్పందించిన సుష్మ ఈ ఘటనపై భారత రాయబారిని వివరాలు అడిగామని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ సహా పలువురు రాధాకృష్ణన్ స్నేహితులు ఈ విషయంలో సుష్మ సాయం కోరారు.
తప్పుడు కేసులో అతడిని ఇరికించారని ఆరోపించారు. వారం పాటు వ్యాపార పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన రాధాకృష్ణన్ తిరిగి భారత్కు వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







