స్వల్పంగా పెరిగిన బంగారం ధర...
- February 01, 2017
ముంబయి: ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.29,750కి చేరింది. బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉంది. జనవరి 28 నుంచి పది గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగి కేజీ వెండి ధర రూ.42వేల మార్కును దాటిపోయింది. ఈరోజు కేజీ వెండి రూ. 300 పెరిగి రూ.42,200కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్ మార్కెట్లో ఈరోజు ఔన్సు బంగారం ధర 0.59శాతం పెరిగి 1,208.50 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









