శ్రీవారి రూ. 300 దర్శన్ టికెట్ల బుకింగ్ ఇకపై సులభంగా...

- February 02, 2017 , by Maagulf
శ్రీవారి రూ. 300 దర్శన్ టికెట్ల బుకింగ్ ఇకపై సులభంగా...

తిరుమల: ఈనెల 3వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో రూ. 300 టికెట్లను ఏపీటీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా బుక్‌ చేసుకోవచ్చునని టీటీడీ ఈవో సాంబశివరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. భక్తులు ప్రైవేటు ఇంటర్నెట్‌ సెంటర్లపై ఆధారపడకుండా సులువుగా, తక్కువ సొమ్ముతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చునని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 8 వేల ఆన్‌లైన్‌ సెంటర్లు ఉన్నాయని, వీటితోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో సైతం శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో టికెట్‌కు రూ.5 చొప్పున సర్వీసు ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుందని సాంబశివరావు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com