ఏపీ ఉద్యోగులకు 3 శాతం డీఏ...

- February 03, 2017 , by Maagulf
ఏపీ ఉద్యోగులకు 3 శాతం డీఏ...

మార్చి వరకు బకాయిలు అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరవు భత్యం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ పెంపు 2016 జనవరి నుంచీ వర్తిస్తుంది. కరవుభత్యం బకాయిలను మార్చి వరకు ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. ఏప్రిల్‌ నుంచి నేరుగా వారి వేతనాల్లో చెల్లించనున్నారు. డీఏ పెంపుతో ఖజానాపై నెలకు రూ.8.64 కోట్ల అదనపు భారం పడనుంది. గతేడాది జనవరి నుంచీ ఉద్యోగులు ఈ డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ విడుదలపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com