ఏపీ ఉద్యోగులకు 3 శాతం డీఏ...
- February 03, 2017
మార్చి వరకు బకాయిలు అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరవు భత్యం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ పెంపు 2016 జనవరి నుంచీ వర్తిస్తుంది. కరవుభత్యం బకాయిలను మార్చి వరకు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఏప్రిల్ నుంచి నేరుగా వారి వేతనాల్లో చెల్లించనున్నారు. డీఏ పెంపుతో ఖజానాపై నెలకు రూ.8.64 కోట్ల అదనపు భారం పడనుంది. గతేడాది జనవరి నుంచీ ఉద్యోగులు ఈ డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ విడుదలపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









