గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు

- February 04, 2017 , by Maagulf
గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలిఘట్టం. గోవా, పంజాబ్‌లో పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఆరు నుంచే ఓటర్లు బారులుతీరారు. ఎన్నికల సంఘం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వెబ్‌-కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ పోలింగ్ ప్రక్రియను రికార్డు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పంజాబ్‌లో బందోబస్తు కోసం 200 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలను రంగంలోకి దించారు. 

పంజాబ్‌లో 117 స్థానాలకు వెయ్యి 145 మంది పోటీ పడుతున్నారు. ఐదు ప్రాంతాల్లో తొలిసారిగా ఈ-బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఆత్మానగర్‌, తూర్పు లూథియానా, ఉత్తర లూథియానా, ఉత్తర అమృత్‌సర్‌, పశ్చిమ జలంధర్‌ ప్రాంతాల్లో ఈ-బ్యాలెట్‌ సిస్టమ్‌ ఉపయోగించారు. గోవాలో 40 స్థానాలకు 250మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. మరోవైపు.. రక్షణమంత్రి మనోహర్ పారికర్ సామాన్య పౌరుడిగా క్యూలో నిల్చును ఓటేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com