బీఎస్ఎన్ఎల్లో బంపర్ ఆఫర్...
- February 04, 2017
న్యూఢిల్లీ: జియో ఉచిత డేటాతో టెలికాం కంపెనీలన్నీ డేటా టారిఫ్ ధరల్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఉన్న ధరకు మూడు రెట్లు తగ్గించి రూ.36కే 1 జీబీ డేటా అందిస్తోంది. నియోగదారులకు ప్రత్యేక ప్యాక్ కింద ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. టెలికాం రంగంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ప్యాక్ అని తెలిపింది. అంతేకాకుండా రూ.291 ప్లాన్లో డేటాను నాలుగు రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. 2 జీబీకి బదులు 8జీబీ డేటా, రూ.78 ప్లాన్లో డబుల్ డేటా(2జీబీ) అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇంటర్నెట్ మార్గెట్ పెంచుకోవడానికే ఈ ఆఫర్లు తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







