ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం
- February 06, 2017
పాపం.. ఇంగ్లాండ్! క్రికెట్లో ప్రతి ఫార్మాట్లో భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదు. మొన్న కోహ్లీసేన చేతిలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్లు కోల్పోయింది. స్వదేశంలో జరుగుతున్న అంధుల క్రికెట్ ప్రపంచకప్లో భారత్తో జరిగిన టీ20లోనూ చిత్తు చిత్తుగా ఓడింది. ఇప్పుడు యూత్వన్డే అండర్-19 ఐదు మ్యాచ్ల సిరీస్లోనూ కోల్పోయింది. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా కుర్రాళ్లు ఇంగ్లాండ్ను 230 పరుగుల భారీ తేడాతో ఓడించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..
శుభమ్ గిల్ (160 నాటౌట్; 120 బంతుల్లో), పృథ్వీషా (105; 89 బంతుల్లో) అద్భుత శతకాలు సాధించడంతో 9 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ జోడీ రెండో వికెట్కు 164 బంతుల్లో 231 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ను బౌలర్లు చుట్టేశారు. కమలేశ్ నాగర్కోటీ (4/31), వివేకానంద తివారీ (3/20), శివమ్ మావీ (2/18), ముగ్గురూ కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లిష్ జట్టు 152 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ 3-1తో సిరీస్ను కైవసం చేసుకొంది.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







