మహేశ్, కొరటాల శివ కాంబినేషన్ రెండో సినిమా...
- February 07, 2017
మహేశ్, కొరటాల శివ కాంబినేషన్ రెండో సినిమాకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరి కలయికలో వచ్చిన 'శ్రీమంతుడు' మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. కొత్త సినిమా కోసం కథా చర్చల కోసం ఆ ఇద్దరూ మలేసియాకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారితో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సైతం ఉన్నారు. అక్కడ స్ర్కిప్టును ఓ కొలిక్కి తేవడంతో పాటు సంగీత చర్చలు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న సినిమా చివరి షెడ్యూల్కు వచ్చింది. ఈ నెల 15 నుంచి పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్లలో మార్చి నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది.
మిగిలి ఉండే రెండు పాటల్ని మహేశ్, నాయిక రకుల్ప్రీత్పై విదేశాల్లో తీస్తారు. అనంతరం ఏప్రిల్ నుంచి కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమా కోసం కాల్షీట్లు కేటాయించారు మహేశ్. ఇందులో నాయికగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో తాజా సంచలనం కీర్తి సురేశ్ పేరు కూడా ఒకటి.
మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









