భారత ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న 11 మంది అరెస్ట్

- February 09, 2017 , by Maagulf
భారత ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న 11 మంది అరెస్ట్

పాకిస్థాన్ తరుఫున గూఢచర్యం నిర్వహించి భారత ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్న 11 మందిని మధ్యప్రదేశ్ ఉగ్ర నిరోధక దళం అరెస్ట్ చేసింది. ఇందులో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. వీరు భోపాల్, గ్వాలియర్, జబల్‌పూర్, సాట్నాలో చైనా పరికరాలతో టెలిఫోన్ ఎక్సైంజ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఇండియన్ ఆర్మీ సైనిక ఆపరేషన్స్ సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్ఐకి చేరవేస్తున్నారు.
ఈ ముఠాకు నాయకుడైన బలరామ్ బ్యాంకు ఖాతాల్లోకి పాక్ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. వీటిని అతడు జమ్మూకశ్మీర్‌లోని ఇద్దరు పాక్ ఐఎస్ఐకి చెందిన వారికి చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గత ఏడాది నవంబర్ 13న ఈ ఇద్దరి అరెస్ట్‌తో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com