డ్యూటీలో వున్నప్పుడు మొబైల్ ఫోన్ నిషేధం
- February 09, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ సెక్టార్ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్ మినిస్ట్రీ దీనికి సంబంధించి సర్క్యులర్ని తాజాగా జారీ చేసింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సర్క్యులర్లో పేర్కొంది మినిస్ట్రీ. మొబైల్ కాల్స్తోపాటుగా, మొబైల్లో సోషల్ మీడియా వినియోగించడం కూడా ఉల్లంఘనగానే పరిగణిస్తారు. హెల్త్కేర్ రంగంలో మెరుగైన సేవలందించేందుకోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మినిస్ట్రీ భావిస్తోంది. సివిల్ సర్వీసెస్ బ్యూరో డెసిషన్ 22లో పేర్కొన్న విధంగా ఉల్లంఘనలకు జరీమానా విధించడం జరుగుతుంది. ఫిబ్రవరి ఆరున ప్రైమరీ కేర్ అండ్ పబ్లిక్ హెల్త్ యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ వలీద్ అల్ మానె సంతకంతో కూడిన ఈ సర్క్యులర్ విడుదలైంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









