డ్యూటీలో వున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ నిషేధం

- February 09, 2017 , by Maagulf
డ్యూటీలో వున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ నిషేధం

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, హెల్త్‌ సెక్టార్‌ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ వినియోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్‌ మినిస్ట్రీ దీనికి సంబంధించి సర్క్యులర్‌ని తాజాగా జారీ చేసింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది మినిస్ట్రీ. మొబైల్‌ కాల్స్‌తోపాటుగా, మొబైల్‌లో సోషల్‌ మీడియా వినియోగించడం కూడా ఉల్లంఘనగానే పరిగణిస్తారు. హెల్త్‌కేర్‌ రంగంలో మెరుగైన సేవలందించేందుకోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మినిస్ట్రీ భావిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ బ్యూరో డెసిషన్‌ 22లో పేర్కొన్న విధంగా ఉల్లంఘనలకు జరీమానా విధించడం జరుగుతుంది. ఫిబ్రవరి ఆరున ప్రైమరీ కేర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ యాక్టింగ్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ వలీద్‌ అల్‌ మానె సంతకంతో కూడిన ఈ సర్క్యులర్‌ విడుదలైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com