చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం
- September 17, 2015
భారీ భూకంపం ఒకటి చిలీని వణికించేస్తోంది. రిక్టర్ స్టేల్పై 8.3గా నమోదయ్యింది. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనం బెంబేలెత్తిపోయారు. అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఇదిలా ఉండగానే సునామీ హెచ్చరికలతో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వాల్ పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే ప్రమాదముందని సునామీ హెచ్చరికల జారీ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు ఇళ్ళలో ఉండలేక బయటకు వెళ్లలేక నడి రోడ్లపైనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







