వాట్సాప్లో తీవ్రవాదం: ఏడేళ్ళ జైలు ...
- February 09, 2017
జెడ్డా: రియాద్లోని ప్రత్యేక క్రిమినల్ న్యాయస్థానం ఓ వ్యక్తికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. డయీష్ తీవ్రవాద సంస్థకి మద్దతివ్వడం, ఆ సంస్థకి చెందిన అత్యున్నతస్థాయి వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం వంటి నేరాలకుగాను నిందితుడికి శిక్ష ఖరారయ్యింది. వాట్సాప్ ద్వారా డయీష్ సంస్థ ప్రముఖులతో సంబంధాల్ని నిందితుడు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. డయీష్లో చేరి నసిరియాకి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. డయీష్ సంస్థకి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ని నిందితుడి మొబైల్ ఫోన్లో గుర్తించారు పోలీసులు. అరెస్ట్ అయినప్పటినుంచి ఏడేళ్ళపాటు నిందితుడికి జైలు శిక్షను విధించడం జరిగింది. శిక్ష పూర్తయ్యాక ఏడేళ్ళపాటు ట్రావెల్ బ్యాన్ కూడా అదనంగా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







