వాట్సాప్లో తీవ్రవాదం: ఏడేళ్ళ జైలు ...
- February 09, 2017
జెడ్డా: రియాద్లోని ప్రత్యేక క్రిమినల్ న్యాయస్థానం ఓ వ్యక్తికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. డయీష్ తీవ్రవాద సంస్థకి మద్దతివ్వడం, ఆ సంస్థకి చెందిన అత్యున్నతస్థాయి వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం వంటి నేరాలకుగాను నిందితుడికి శిక్ష ఖరారయ్యింది. వాట్సాప్ ద్వారా డయీష్ సంస్థ ప్రముఖులతో సంబంధాల్ని నిందితుడు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. డయీష్లో చేరి నసిరియాకి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. డయీష్ సంస్థకి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ని నిందితుడి మొబైల్ ఫోన్లో గుర్తించారు పోలీసులు. అరెస్ట్ అయినప్పటినుంచి ఏడేళ్ళపాటు నిందితుడికి జైలు శిక్షను విధించడం జరిగింది. శిక్ష పూర్తయ్యాక ఏడేళ్ళపాటు ట్రావెల్ బ్యాన్ కూడా అదనంగా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







